వేధిస్తున్నారని సీఐడీ ఎస్పీ పై మహిళ ఫిర్యాదు: హైద్రాబాద్ చైతన్యపురి పోలీసుల కేసు నమోదు

Published : Jul 30, 2023, 09:59 AM IST
వేధిస్తున్నారని  సీఐడీ ఎస్పీ పై  మహిళ ఫిర్యాదు: హైద్రాబాద్ చైతన్యపురి పోలీసుల కేసు నమోదు

సారాంశం

ఓ మహిళ ఫిర్యాదు మేరకు సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ పై  హైద్రాబాద్ చైతన్యపురి పోలీసులు కేసు నమోదు  చేశారు.  తనను వేధిస్తున్నారని  ఎస్పీపై  మహిళ ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  సీఐడీ విభాగంలో  ఎస్పీ ర్యాంకులో పనిచేస్తున్న  కిషన్ సింగ్ పై  కేసు నమోదైంది.ఓ మహిళ ఫిర్యాదు మేరకు  పోలీసులు  కేసు నమోదు  చేశారు.  నగరంలోని  దిల్‌సుఖ్ నగర్ కొత్తపేటలో టీఎస్‌పీఎస్‌‌పీడీసీఎల్  విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి  సీఐడీ ఎస్పీపై  ఫిర్యాదు  చేసింది. తన  ఫోన్ కు  సీఐడీ ఎస్పీ అసభ్యకరమైన  మేసేజ్ లు, ఫోటోలు పంపుతున్నారని  మహిళ ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుపై  హైద్రాబాద్ చైతన్యపురి పోలీసులు విచారణ నిర్వహించి  కేసు నమోదు  చేశారు.

 

PREV
click me!

Recommended Stories

Hyderabad Haunted House : నగర నడిబొడ్డున దెయ్యాల నివాసం.. కుందన్‌బాగ్‌ బంగ్లా అసలు కథ ఇదే..!
KTR First Reaction on Kavitha Party: కవిత పార్టీపై కేటీఆర్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ | Asianet News Telugu