
హైదరాబాద్ హయత్నగర్లో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలోనే హయత్నగర్లోని జీ స్కూల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖానికి స్కార్ఫ్తో వచ్చిందని విద్యార్థిని పాఠశాల యాజమాన్యం ఆమెను ఇంటింకి పంపింది. అయితే ఇందుకు సంబంధించి బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థిని స్టేట్మెంట్ ఆధారంగా స్కూల్పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు తెలుగు న్యూస్ చానల్ రిపోర్టు చేసింది. ఇక, బాధిత విద్యార్థిని హయత్నగర్ కోర్టు న్యాయమూర్తి కూతురు అని సమాచారం.