రేవంత్‌కి భద్రతను పెంచమన్న హైకోర్టు.. కేంద్రానిదే బాధ్యత

By sivanagaprasad kodatiFirst Published Oct 29, 2018, 2:06 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి భద్రతను పెంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పలువురి నుంచి తనకు ప్రాణహానీ ఉండటంతో పాటు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాల్సి ఉండటంతో తనకు 4 ప్లస్ 4 భద్రతను కల్పించాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి భద్రతను పెంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పలువురి నుంచి తనకు ప్రాణహానీ ఉండటంతో పాటు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాల్సి ఉండటంతో తనకు 4 ప్లస్ 4 భద్రతను కల్పించాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రేవంత్‌కు అదనపు భద్రతను కల్పించాల్సిందిగా కేంద్రప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందుకు అవసరమైన ఖర్చను మాత్రం రేవంతే భరించాలని పేర్కొంది.

click me!