మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఆపే ప్రసక్తే లేదు: హైకోర్టు

Published : May 16, 2019, 04:54 PM IST
మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఆపే ప్రసక్తే లేదు: హైకోర్టు

సారాంశం

మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ హైకోర్టు  తేల్చి చెప్పింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల పిటిషన్‌పై గురువారం నాడు  విచారించింది.   

హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ హైకోర్టు  తేల్చి చెప్పింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల పిటిషన్‌పై గురువారం నాడు  విచారించింది. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహన్  నేతృత్వంలోని వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం ప్రకటించింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధ ప్రాజెక్టులకు సంబంధించి హైకోర్టులో 175కు పైగా పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటిని కలిపి విచారించాలంటూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైకోర్టులో మధ్యంతర ధరఖాస్తు చేసుకొన్న విషయం తెలిసిందే.

ఈ ప్రాజెక్టు పరిధిలో 47 ఎకరాలకు చెందిన నిర్వాసితులు మాత్రమే పరిహరం తీసుకొనేందుకు నిరాకరించారని కోర్టుకు న్యాయవాది తెలిపారు. పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే తమ వద్దకు రావాలని హైకోర్టు తెలిపింది.

PREV
click me!

Recommended Stories

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం | First Darshan of Ujjaini Mahankali Temple | Bonalu 2026
Weather Update: రాబోయే 3 రోజులు వానలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక