తెలంగాణ సర్కార్ కు ఊరట: ముందస్తు ఎన్నికల పిటీషన్లను కొట్టేసిన హైకోర్టు

Published : Oct 12, 2018, 03:08 PM ISTUpdated : Oct 12, 2018, 03:11 PM IST
తెలంగాణ సర్కార్ కు ఊరట: ముందస్తు ఎన్నికల పిటీషన్లను కొట్టేసిన హైకోర్టు

సారాంశం

 హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. ముందస్తు ఎన్నికలను సవాల్ చేస్తూ వేసిన పిటీషన్లను రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం కొట్టేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. 

హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. ముందస్తు ఎన్నికలను సవాల్ చేస్తూ వేసిన పిటీషన్లను రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం కొట్టేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. 

అసెంబ్లీని రద్దును సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ, శశాంకర్ రెడ్డి పిటీషన్లను హైకోర్టు కొట్టి వేసింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోకుండా అసెంబ్లీని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ అరుణ, శశాంక్ రెడ్డి పిటీషన్లు దాఖలు చేశారు. 

ఈ నేపథ్యంలో ఇరు వాదనలు విన్న కోర్టు ప్రభుత్వ వాదనలను అంగీకరించింది. కేబినేట్ నిర్ణయం తుది నిర్ణయం ఉందని చెప్తూ ప్రభుత్వతరపున వాదనలను కోర్టు ఏకీభవించింది. దీంతో ముందస్తు ఎన్నికలపై వేసిన అన్ని పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది.  

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu