హైదరాబాద్లో శనివారం భారీ వర్షం కురిసింది. జోరు వానల ధాటికి ముసారాంబాగ్ వంతెన పైనుంచి మూసీ నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా ఉస్మాన్సాగర్ జలకళ సంతరించుకుంది. జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు ఒక్క అడుగు మేర రెండు గేట్లను ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు
ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. అంబర్పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట, లంగర్హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహిదీపట్నంతో పాటు మీర్పేట, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, కోఠి, అబిడ్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జోరు వానల ధాటికి ముసారాంబాగ్ వంతెన పైనుంచి మూసీ నీరు ప్రవహిస్తోంది.
గత రెండు రోజుల పాటు కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే హైదరాబాద్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
కాగా, భారీ వర్షాల కారణంగా ఉస్మాన్సాగర్ జలకళ సంతరించుకుంది. జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు ఒక్క అడుగు మేర రెండు గేట్లను ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జల మండలి ఎండీ దాన కిశోర్ ప్రజలకు సూచించారు.