నాగర్ కర్నూల్ లో భారీ వర్షం.. మిద్దె కూలి దంపతుల మృతి...

By Bukka SumabalaFirst Published Sep 5, 2022, 11:10 AM IST
Highlights

నాగర్ కర్నూల్ లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు మట్టిమిద్దె కూలడంతో ఓ దంపతులు మృత్యువాత పడ్డారు. 

నాగర్ కర్నూల్ : జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. అర్ధ రాత్రి కురిసిన భారీవర్షానికి ఇంటి మట్టి మిద్దె కూలింది. దీంతో నిద్రిస్తున్న ఇద్దరు దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. భార్య భర్తలు ఇద్దరు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు భోగరాజు చంద్రయ్య (65), వెంకటమ్మ (62)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

click me!