ఆస్పత్రికి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్: ఇంటికి చేరుకుంటున్న బంధువులు

By pratap reddyFirst Published Aug 29, 2018, 8:26 AM IST
Highlights

ప్రమాదం గురించి తెలుసుకున్న నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాదులోని మెహిదీపట్నంలో గల ఇంటికి హరికృష్ణ బంధువులు చేరుకుంటున్నారు. 

హైదరాబాద్: ప్రమాదం గురించి తెలుసుకున్న నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాదులోని మెహిదీపట్నంలో గల ఇంటికి హరికృష్ణ బంధువులు చేరుకుంటున్నారు. 

ఆయన బావ, సోదరి దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరి ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి నందమూరి హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యామ్ రామ్ బయలుదేరారు. 

హరికృష్ణ భార్యను, పిల్లలను ఓదార్చేందుకు బంధువులు అక్కడికి చేరుకుంటున్నారు. భార్యాపిల్లలను ఓదార్చేందుకు అక్కడికి చేరుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హరికృష్ణ బావ నారా చంద్రబాబు నాయుడు కూడా తన నివాసం నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది.

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ మృతి ( వీడియో)

ప్రజల్లో చెరగని ముద్ర... హరికృష్ణ రాజకీయ ప్రస్థానం

రోడ్డు ప్రమాదంలో హరిక్రిష్ణ దుర్మరణం (ఫోటోలు)

బాబుతో హరికృష్ణకు విబేధాలు, ఎందుకంటే?

click me!