బీఆర్‌ఎస్ ను గెలిపించేందుకు బీజేపీ కార్యకర్తలపై పోలీసుల వేధింపులు : రాజాసింగ్

Google News Follow Us

సారాంశం

Telangana Assembly Elections 2023: ''పోలీసులు ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలనుకుంటే, వారు నా పార్టీ కార్యకర్తలను వేధించకూడదు.. హింసించకూడదు. వారి కృషి వల్లే ఈ స్థాయికి చేరుకున్నాం. ఎన్నికల సమయంలో పోలీసులు ఆటంకాలు జరగాలని కోరుకుంటే, వారు పక్షపాత ధోరణితో ప్రవర్తించవచ్చు..'' అని  గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయ‌కుడు టీ. రాజా సింగ్ అన్నారు.
 

Goshamahal MLA and BJP leader T Raja Singh: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతల సాకుతో తమ పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ పోలీసులపై ఆరోప‌ణ‌లు గుప్పించారు. తన కోసం ప్రచారం చేస్తున్న తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు క్యాడర్‌ను కూడా ఫోన్‌లో బెదిరిస్తున్నారని ఆరోపించారు. ''ఇరుగుపొరుగులో ఎవరైనా చిన్న చిన్న గొడవలకు పాల్పడితే, సమస్య పరిష్కరించబడినప్పటికీ, వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారు'' అని ఆరోపించారు.

హత్య, హత్యాయత్నం, డకాయిటీ, దోపిడీ కేసుల్లో పలువురు రౌడీ షీటర్లు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వంటి ఇతర రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించిన రాజాసింగ్.. వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం లేదని అన్నారు.  ''పోలీసులు ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలనుకుంటే, వారు నా పార్టీ కార్యకర్తలను వేధించకూడదు.. హింసించకూడదు. వారి కృషి వల్లే ఈ స్థాయికి చేరుకున్నాం. ఎన్నికల సమయంలో పోలీసులు ఆటంకాలు జరగాలని కోరుకుంటే, వారు పక్షపాత ధోరణితో ప్రవర్తించవచ్చు..'' అని  గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయ‌కుడు టీ. రాజా సింగ్ అన్నారు.

అలాగే, త‌న‌కు బెదిరింపు కాల్స్ కూడా వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. బుధవారం (అక్టోబర్ 26న‌) తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్‌లో చంపేస్తానని బెదిరింపులు వ‌చ్చాయ‌ని రాజాసింగ్ ఆరోపించారు. ఎన్నికల కౌంటింగ్‌కు ముందు తనను కాల్చివేస్తామ‌ని కాల్ చేసి ఒక‌ వ్యక్తి బెదిరించాడని ఆయన పేర్కొన్నారు. కాగా, రాజా సింగ్‌కు బుల్లెట్ రెసిస్టెంట్ వెహికల్, వ్యక్తిగత భద్రతా అధికారులు పిస్టల్స్, కార్బైన్ గన్‌లు, 24 గంటలూ ఎంపీ 4 అడ్వాన్స్ గన్‌లను అందించారు. కాగా, మహ్మద్ ప్రవక్తపై దైవదూషణకు పాల్పడినందుకు గత ఏడాది ఆగస్టులో అరెస్టయిన వివాదాస్పద ఎమ్మెల్యేను బీజేపీ సస్పెండ్ చేసింది. ఆగస్ట్ 2022లో నగరంలో ఒక ప్రదర్శన నిర్వహించడానికి హాస్యనటుడు మునావర్ ఫరూఖీని పోలీసులు అనుమతించినందుకు ప్రతిస్పందనగా అతను ఈ వీడియోలను రూపొందించారు. అయితే, ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్ ను ఎత్తివేసి, గోషామ‌హ‌ల్ నుంచి ఎన్నిక‌ల బ‌రిలో నిలిపింది.

Read more Articles on