నమ్మించి తీసుకెళ్లి అత్యాచారం: రక్తస్రావంతో బాలిక దుర్మరణం

By telugu teamFirst Published May 30, 2021, 6:46 AM IST
Highlights

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడి అమ్మాయితో పరిచయం పెంచుకుని, ఆమెను నమ్మించి నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక మృత్యువాత పడింది.

మహబూబాబాద్: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలికతో యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఆ  పరిచయంతో ఆమెను ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. దాంతో తీవ్రమైన రక్తస్రావమై బాలిక ప్రాణాలు విడిచింది. 

ఆ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండధర్మారం గ్రామ శివారులో శనివారంనాడు చోటు చేసుకుంది. మండలంలోి సీతారాం తండాకు చెందిన ఓ బాలిక (17)తో సమీపంలోని తండా ధర్మారానికి చెందిన హార్వెస్టర్ డ్రైవర్ ధరంసోత్ రాజేష్ పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయంతో శనివారం మధ్యాహ్నం 365 జాతీయ రహదారికి దగ్గరలో గల ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి బాలికను తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. 

ఆ తర్వాత మిత్రుడికి ఫోన్ చేసి బాలిక స్పృహ తప్పి పడిపోయిందని, ఫిట్స్ వచ్చాయని చెప్పాడు. దాంతో మిత్రుడు అక్కడికి వచ్చాడు. స్నేహితుడితో కలిసి బాలికను టూవీలర్ మీద మధ్యలో కూర్చోబెట్టుకుని పురుషోత్తమాయగూడెంలోని గ్రామీణ వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్లారు. అప్పటికే బాలిక మరణించినట్లు ఆర్ఎంపీ చెప్పాడు. దాంతో మృతదేహాన్ని ఆ ఇద్దరు ఘటనా స్థలానికి తీసుకుని వెళ్లి పడేశారు. బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఫిట్స్ వచ్చి పడిపోయిందని నిందితుడు చెప్పాడు. 

మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుుడ రాజేష్ ను పోలీసుుల అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

గిరిజన యువతిపై అత్యాచారం చేసినవారిని కఠినంగా శిక్షించాలని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసు అధికారులను, కలెక్టర్ ను ఆదేశించారు. యువతి తండ్రితో సత్యవతి రాథోడ్ మాట్లాడి అండగా ఉంటామని చెప్పారు దారుణానికి పాల్పడినవారిని వెంటనే పట్టుకుని కఠినం శిక్షించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి కూడా ఆదేశించారు.

click me!