రోడ్డుపై ఉమ్మేసిన ఆర్టీసీ డ్రైవర్.. జీహెచ్ఎంసీ షాక్

Published : Jul 03, 2019, 02:25 PM IST
రోడ్డుపై ఉమ్మేసిన ఆర్టీసీ డ్రైవర్.. జీహెచ్ఎంసీ షాక్

సారాంశం

ఆర్టీసీ బస్సు డ్రైవర్ కి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. రోడ్డుపై  ఉమ్మి వేసినందుకు జరిమానా విధించారు. 

ఆర్టీసీ బస్సు డ్రైవర్ కి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. రోడ్డుపై  ఉమ్మి వేసినందుకు జరిమానా విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే... కుషాయిగూడ బస్ డిపోకు చెందిన డ్రైవర్ జగదీష్... బస్సులో కూర్చొని రోడ్డుపై ఉమ్మి వేశాడు. దీంతో అప్పుడే రోడ్లను పరిశుభ్రం చేసిన జీహెచ్ఎంసీ కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. 

వెంటనే ఈ విషయంపై  ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు డ్రైవర్ జగదీష్‌కు జరిమానా విధించారు. వంద రూపాయల జరిమానా చెల్లించాలన్నారు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ లింగంపల్లిలో ఉన్నాడని తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి మరీ జరిమానా విధించడం గమనార్హం. 
 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu