ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ... ఫ్రెండ్‌ని కత్తితో పొడిచి హత్య.. మళ్లీ జగిత్యాలలోనే

By sivanagaprasad kodatiFirst Published Oct 16, 2018, 9:46 AM IST
Highlights

 జగిత్యాలలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ ఒక ప్రాణం తీసింది. తాటిపల్లి గ్రామానికి చెందిన నవీన్, శ్రవణ్ అనే ఇద్దరు మిత్రులు డిగ్రీ చదువుతున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి వారిద్దరూ మద్యం సేవించి.. గొడవ పడ్డారు. ఈ క్రమంలో శ్రవణ్ కత్తితో నవీన్‌ను పొడిచాడు.

కొద్దిరోజుల క్రితం జగిత్యాలకు చెందిన మహేందర్, రవితేజ అనే ఇద్దరు స్నేహితుల సజీవదహనం వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు స్నేహితులు మద్యం తాగి.. ఆ అమ్మాయిని విడిచిపెట్టలేక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసున్నారు.

ఈ ఘటన మరిచిపోకముందే అదే జగిత్యాలలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ ఒక ప్రాణం తీసింది. తాటిపల్లి గ్రామానికి చెందిన నవీన్, శ్రవణ్ అనే ఇద్దరు మిత్రులు డిగ్రీ చదువుతున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి వారిద్దరూ మద్యం సేవించి.. గొడవ పడ్డారు. ఈ క్రమంలో శ్రవణ్ కత్తితో నవీన్‌ను పొడిచాడు.

ఈ ఘటనలో నవీన్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రవణ్‌ను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

జగిత్యాల ప్రేమ దేశం కథ: ఆ మూడో వ్యక్తి ఎవరు, ఏమయ్యాడు?

జగిత్యాల ప్రేమ దేశం కథ: అక్కా చెల్లెళ్లతో వన్‌సైడ్ లవ్, భయంతోనే....

 

click me!