పైకి మసాజ్ సెంటరే.. లోపలికెళ్తే

sivanagaprasad kodati |  
Published : Dec 24, 2018, 10:48 AM IST
పైకి మసాజ్ సెంటరే.. లోపలికెళ్తే

సారాంశం

మసాజ్ సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు రాచకొండ స్పెషల్ ఆపరేషన్స్ పోలీసులు. సికింద్రాబాద్ నాచారం పోస్ట్ ఆఫీస్ వెనుక వైపున ఉన్న ఇంట్లో మసాజ్ పార్లర్ నడుపుతున్నారు. 

మసాజ్ సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు రాచకొండ స్పెషల్ ఆపరేషన్స్ పోలీసులు. సికింద్రాబాద్ నాచారం పోస్ట్ ఆఫీస్ వెనుక వైపున ఉన్న ఇంట్లో మసాజ్ పార్లర్ నడుపుతున్నారు.

ఇక్కడ మసాజ్ ముసుగులో వ్యభిచారం జరుగుతోందంటూ ఫిర్యాదు అందడంతో రాచకొండ పోలీసులు సదరు మసాజ్ పార్లర్‌పై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు.

దాడిలో భాగంగా ముగ్గురు మహిళలను రక్షించి.. స్పా యజమాని శ్రీరామ్‌, సిబ్బంది మణికంఠ, రాజేశ్‌లతో పాటు కస్టమర్లు నాగేశ్వరరావు, సంతోష్‌లను అదుపులోకి తీసుకున్నారు. రూ.7,570 నగదు, నాలుగు బిల్లు పుస్తకాలు, క్యాట్‌లాగ్, ఆరు సెల్‌ఫోన్లు, మూడు రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!