సంజీవయ్య పార్క్ వద్ద అగ్ని ప్రమాదం

Published : May 15, 2019, 02:46 PM IST
సంజీవయ్య పార్క్ వద్ద అగ్ని ప్రమాదం

సారాంశం

హైదరాబాద్ నగరంలోని సంజీవయ్య పార్క వద్ద బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. పార్క్ వద్ద ఉన్న నర్సరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

హైదరాబాద్ నగరంలోని సంజీవయ్య పార్క వద్ద బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. పార్క్ వద్ద ఉన్న నర్సరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో చాలా మొక్కలు కాలి బూడిదయ్యాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క ఫైర్ ఇంజినే రావడంతో.. మంటలు ఆర్పడం కష్టంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలంగాణలో అత్యధిక వర్షం కురిసిన టాప్ 10 ప్రాంతాలివే.. ఈ జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ యాక్టివ్
Jeevan Reddy: సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు| Asianet News Telugu