బంజారాహిల్స్ స్కైబ్లూ హోటల్లో అగ్నిప్రమాదం

Published : Feb 25, 2019, 08:07 PM IST
బంజారాహిల్స్ స్కైబ్లూ హోటల్లో  అగ్నిప్రమాదం

సారాంశం

హైదరాబాద్ బంజారాహిల్స్ లో స్కైబ్లూ హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ మూడో అంతస్తులో హటాత్తుగా మంటలు చెలరేగాయి. అంతకంతకు మంటలు విజృంభించి ఆ అంతస్తులోని అన్ని గదులను దహనం చేశాయి. 

హైదరాబాద్ బంజారాహిల్స్ లో స్కైబ్లూ హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ మూడో అంతస్తులో హటాత్తుగా మంటలు చెలరేగాయి. అంతకంతకు మంటలు విజృంభించి ఆ అంతస్తులోని అన్ని గదులను దహనం చేశాయి. 

మంటలను గమనించిన హోటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. 

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే హోటల్లోని విలువైన ఫర్నీచర్  కాలిబూడిదవడంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు హోటల్ యాజమాన్యం తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.