మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరిని కొట్టి చంపిన ఆరుగురు.. అరెస్ట్ చేయాలని ఆందోళన..

Published : Jun 20, 2022, 07:36 AM IST
మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరిని కొట్టి చంపిన ఆరుగురు.. అరెస్ట్ చేయాలని ఆందోళన..

సారాంశం

స్నేహితుల మధ్య మద్యం తాగిన తరువాత వచ్చిన ఘర్షణ ఒకరి మృతికి కారణమయ్యింది. ఘర్షణతో తనకు సంబంధం లేదన్నందుకు ఒకరిని ఆరుగురు కలిసి కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి మరణించాడు. 

ధర్మసాగర్ :  కొట్టి చంపిన వారిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు,  గ్రామస్తులు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం ఆందోళనకు దిగారు. రెండు గంటలపాటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామస్థుల కథనం ప్రకారం... ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన బొమ్మినేని విజేందర్ రెడ్డి (29), పుట్ట షణ్ముఖ రెడ్డి,  మందపురి వంశీ, గై రాజేష్,  మేకల రాజేందర్,  కుక్కల వంశీ,  నరేందర్ ఈ నెల 10వ తేదీన కరుణాపురం వద్ద మద్యం తాగారు.

ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణతో తనకు సంబంధం లేదని విజేందర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో ఆగ్రహించిన మిగతా వారు ధర్మపురం వంతెన వద్ద అతడిని అడ్డగించి తీవ్రంగా కొట్టారు. ఈ గొడవలో విజేందర్రెడ్డి  పరిస్థితి విషమంగా ఉండడంతో 11వ తేదీన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్లో ఆరుగురు పేర్లతో బాధితుడి తండ్రి కొమ్మినేని రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు మాత్రం ఇద్దరిపై కేసు నమోదు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. 

ఈ క్రమంలో చికిత్స పొందుతూ విజేందర్ రెడ్డి శనివారం మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ధర్మసాగర్, చిల్పూరు పోలీసులు, స్టేషన్గన్పూర్ ఏసిపి  రఘు చందర్ వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని షణ్ముఖరెడ్డి ఇంటి ముందు ఉంచి ఆదివారం రాత్రి ఆందోళన చేశారు. 

కన్నకొడుకునే కత్తిపీటతో.. గొంతుకోసి చంపిన తండ్రి... మద్యం మత్తులో దారుణం..

ఇదిలా ఉండగా విశాఖపట్నంలో మే 27న మద్యంమత్తులో స్నేహితుల మధ్య మొదలైన చిన్న గొడవ చివరకు ఒకరి హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన విశాఖ మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ లో చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు వెళ్లిన రెబాక సాయితేజ (25) మద్యం మత్తులో మరో స్నేహితుడితో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే అందరూ కలిసి సాయితేజపై రాడ్లు, కత్తులతో దాడిచేయడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దాడికి సంబంధించిన భయానక దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. 

యువకుడి హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీం ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిసి కెమెరా ఫుటేజి ఆదారంగా నిందితులను గుర్తిస్తున్నారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ ఈ హత్య దారితీసి వుంటుందని అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్