కన్న తండ్రే కాటేశాడు: అన్నంలో నిద్ర మాత్రలు కలిపి కూతురిపై అత్యాచారం

By telugu teamFirst Published Jul 20, 2021, 7:56 AM IST
Highlights

హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో అమానుషమైన సంఘటన జరిగింది. ఓ వ్యక్తి కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో బాలిక గర్భం దాల్చింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి కూతురిపై అత్యాచారం చేశాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. దాంతో అసలు విషయం వెలుగు చూసింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఏడాది క్రితం హైదరాబాదు నగరానికి వలస వచ్చింది. భర్త అపార్టుమెంటులో వాచ్ మన్ గా కుదురుకున్నైాడు. భార్య ఇళ్లలో పని మనిషిగా పనిచేస్తూ వస్తోంది. వారికి 16 ఏళ్ల కూతురు, 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు. 

స్వగ్రామంలో చదువుతూ వస్తున్న బాలిక హైదరాబాదు రాగానే చదువు మానేసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. తండ్రి కూతురిపై కన్నేశాడు. అన్నంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చేవాడు. ఆమె నిద్రమత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. నిద్రమత్తులో ఉండడం వల్ల బాలిక తనపై జరుగుతున్న ఘోరాన్ని పసిగట్టలేకపోయింది. 

తల్లి స్వగ్రామానికి వెళ్లి సమయంలో ఓ రోజు మద్యం సేవించి వచ్చిన తండ్రి బాలికపై అత్యాచారం చేశాడు. తల్లికి చెప్తే చంపేస్తానని బెదిరించాడు దాంతో బాలిక మౌనంగా ఉండిపోయింది. మూడు రోజుల క్రితం బాలిక అనారోగ్యానికి గురై వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. దాంతో ఆమెను తల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. 

పరీక్షలు జరిపిన వైద్యులు బాలిక గర్భం దాల్చిందని చెప్పారు. బాలికను ఇంటికి తీసుకుని వచ్చి నిలదీసింది. దాంతో బాలిక బోరున విలపిస్తూ విషయం చెప్పింది. దాంతో తల్లి హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతలో బాలిక తండ్రి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

click me!