కులాంతర వివాహం, తాగి వేధింపులు.. కన్న కొడుకు మెడ నరికి..

By telugu news teamFirst Published Jul 30, 2020, 9:14 AM IST
Highlights

అదే విధంగా మద్యం మత్తులో సంజీవరెడ్డి తలిదండ్రులను వేదించేవాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం గొడవలు జరిగినట్లు సమాచారం.

నిత్యం తాగి వేధిస్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తి కన్న కొడుకునే హతమార్చాడు. కొడుకు ఇంటి మీది డాబా పై నిద్రపోతుండగా.. గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ దారుణ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం మండల పరిదిలోని మొండికుంట గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మొండికుంట గ్రామానికి చెందిన సామా రామిరెడ్డి వ్యవసాయకూలీ అతనికి సంజీవరెడ్డి (33), ఆశోక్‌రెడ్డి ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు సంజీవరెడ్డి ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. దీంతో కొన్నేళ్లుగా మద్యం సేవించి తండ్రి, కొడుకులు తరచూ ఇంట్లో గొడవ పడేవారు. 

దీనికి తోడు సంజీవరెడ్డి వేరే సామాజికవర్గానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి తండ్రి కొడుకుల మధ్య గొడవలు మరింత పెరిగాయి. అదే విధంగా మద్యం మత్తులో సంజీవరెడ్డి తలిదండ్రులను వేదించేవాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం గొడవలు జరిగినట్లు సమాచారం.


ఇది మనసులో పెట్టుకున్న తండ్రి రామిరెడ్డి కొడుకు వేదింపులు భరించలేక హతమర్చాలని నిర్ణయుంచుకున్నాడు. సోమవారం రాత్రి మద్యం సేవించిన సంజీవరెడ్డి డాబాపై నిద్రిస్తుండగా ఇదే ఆదునుగా భావించిన రామిరెడ్డి ఆర్ధరాత్రి గొడ్డలితో మెడపై నరికాడు. అలికిడికి లేచిన రామిరెడ్డి భార్య లక్ష్మమ్మ ఏమి జరిగిందని రామారెడ్డిని నీలదీయగా కొడుకును చంపానని గొడ్డలి ఆమె చేతికి ఇచ్చి పారిపోయాడు. 

అనంతరం చూట్టూపక్కల వారి సహకారంతో డాబాపైకి వెళ్లి చూడగా సంజీవరెడ్డి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే స్ధానికులు పోలీసులకు సమాచారం ఆందించారు. ఆశ్వాపురం సీఐ సట్ల రాజు తమ సిబ్బందితో సంఘటన స్ధలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు తల్లి లక్ష్మమ్మ పిర్యాదు మేరకు నిందితుడిని ఆదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. గతంలో కుటుంబ కలహల నేపథ్యంలో పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది.

click me!