కూతురిని చంపిన తండ్రి.. చితకగొట్టిన గ్రామస్థులు

By telugu teamFirst Published Oct 1, 2019, 9:28 AM IST
Highlights

 రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే నీటితోట్టిలో పడేసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. కాగా.. తండ్రి సూర్యతేజను గ్రామస్థులు పట్టుకున్నారు. 

కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆడపిల్ల అనే కారణంతో నెలల పసికందుని ఓ తండ్రి తన చేతులతో తానే హత్య  చేశాడు. రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే నీటితోట్టిలో పడేసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. కాగా.. తండ్రి సూర్యతేజను గ్రామస్థులు పట్టుకున్నారు. కూతురిని చంపుతావా అంటూ... అతనిని అతి దారుణంగా చితకగొట్టారు. దారుణంగా కొట్టి... అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా... బిడ్డ చనిపోయినందుకు తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

click me!