ఇద్దరు కూతుళ్లకు ఉరేసి, తండ్రి ఆత్మహత్య

Siva Kodati |  
Published : Apr 26, 2019, 08:48 AM IST
ఇద్దరు కూతుళ్లకు ఉరేసి, తండ్రి ఆత్మహత్య

సారాంశం

సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు

సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. దుబ్బాక మండలం లచ్చపేటకు చెందిన బడుగు రాజేందర్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో ఏడాది క్రితం అతని భార్య మరణించింది. దీంతో కూతుళ్లు భవాని, లక్షీతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తన ఇద్దరు కుమార్తెలకు ఉరేసి , అనంతరం తాను కూడా ఉరి వేసుకున్నాడు.

స్ధానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఘటన జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ అంతా అటు వైపే.. కొన‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం
హైద‌రాబాద్‌కు 20 కి.మీల దూరంలో నీటిపై తేలియాడే కాటేజీలు.. ఇక మాల్దీవుల‌తో ప‌నేంటి?