దైవదర్శనానికి వెళ్లివస్తూ.. తండ్రీ, కొడుకు శాశ్వతంగా...

Bukka Sumabala   | Asianet News
Published : Dec 19, 2020, 11:36 AM IST
దైవదర్శనానికి వెళ్లివస్తూ.. తండ్రీ, కొడుకు శాశ్వతంగా...

సారాంశం

దైవదర్శనానికి వెళ్లివస్తున్న ఓ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ మరణించారు.   

దైవదర్శనానికి వెళ్లివస్తున్న ఓ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ మరణించారు. 

ఆయిల్ ట్యాంకర్ ను కారు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీ కొడుకు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని బ్యాంకర్స్ కాలనీ వాసులు దైవ దర్శనానికి తిరుమల వెళ్లి వస్తున్నారు. 

తిరిగి వస్తుండగా ఈ తెల్లవారుజామున తిమ్మాపూర్ వద్దకు రాగానే ఆయిల్ ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ చక్రవర్తి, అతని కుమారుడు కల్యాణ చక్రవర్తి అక్కడిక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి