ములుగు జిల్లా గణపురంలో ఉద్రిక్తత నెలకొంది. గణసముద్రంలోని నీటి విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యే సీతక్కను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించకపోవడంపై రైతులు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ములుగు జిల్లా గణపురంలో ఉద్రిక్తత నెలకొంది. గణసముద్రంలోని నీటి విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యే సీతక్కను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించకపోవడంపై రైతులు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెనాల్ వద్దకు భారీగా చేరుకుని ఎమ్మెల్యే గండ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గండ్ర నీరు విడుదల చేస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఓ రైతు బెదిరించాడు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.