సీఎం క్యాంపాఫీస్‌ దగ్గర కుటుంబం ఆత్మహత్యాయత్నం

By telugu teamFirst Published Jun 17, 2019, 11:59 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ క్యాంపు ఆఫీసు దగ్గర ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం రేపింది.

తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ క్యాంపు ఆఫీసు దగ్గర ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం రేపింది. ఇబ్రహీంపట్నానికి చెందిన ఐలేష్‌ కుటుంబం భూ వివాదంలో తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే నేడు సీఎం క్యాంప్ ఆఫీసుకి వచ్చి కిరోసిన్‌ పోసుకుని వారు ఆత్మహత్యకు ప్రయత్నించారు.  అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందిని ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. వెంటనే ఐలేష్ కుటుంబాన్ని పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు.

click me!