శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కష్టమ్స్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న మహమ్మద్ జీషాన్ ఆధ్వర్యంలో పాతబస్తీకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం, ఖాలీద్ అలీఖాన్, మహమ్మద్ జహీరుద్దీన్, జుబేర్ లు అంతా ముఠాగా ఏర్పాడి నకిలీ వీసాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇప్పటి వరకు కొన్ని వేల మంది పేరిట నకిలీ వీసాలను తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముఠాని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.