ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం.. హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు

Siva Kodati |  
Published : Apr 29, 2023, 05:17 PM IST
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం.. హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు

సారాంశం

హైదరాబాద్‌లో నకిలీ టెలీకాల్ సెంటర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఈ ముఠా మోసం చేస్తోంది. ఈ సందర్భంగా రూ.కోటి విలువైన వస్తువులతో పాటు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. 

హైదరాబాద్‌లో నకిలీ టెలీకాల్ సెంటర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. 21 మందిని అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారిని టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఈ ముఠా మోసం చేస్తోంది. ఈ సందర్భంగా రూ.కోటి విలువైన వస్తువులతో పాటు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇక మరో కేసులో మల్కాజ్‌గిరిలో రూ.66 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. సీలేరు నుంచి హైదరాబాద్ మీదుగా హర్యానాకి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఉగాది పంచాంగ శ్రవణం కేటీఆర్ జాతకం చెప్పిన పండితులు KTR Attend Ugadi Celebrations | Asianet Telugu
Kavitha Kalvakuntla: డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం: కవిత సెటైర్లు | Asianet Telugu