కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల నేతల భేటీ: హమీల అమలుపై చర్చ

Published : Mar 21, 2021, 02:33 PM IST
కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల నేతల భేటీ: హమీల అమలుపై చర్చ

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం నాడు సమావేశమయ్యారు.   

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం నాడు సమావేశమయ్యారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేసీఆర్  పీఆర్సీ విషయంలో హామీలిచ్చారు.పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చిస్తున్నారు. మరో వైపు ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సును పెంచాలని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 

మరో వైపు ప్రమోషన్ల విషయంలో గతంలో ఉన్న  నిబంధనలను కూడ సడలిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయాలపై విధి విధానాలను రూపొందించేందుకు ఆయన ఉద్యోగ సంఘాలతో చర్చించారు.

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడంతో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయమై కేసీఆర్ కేంద్రీకరించారు. ఇదే విషయమై కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో చర్చిస్తున్నట్టుగా సమాచారం.

PREV
click me!

Recommended Stories

Telangana: ఇక‌పై 100 కాదు.. తెలంగాణ‌లో ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ మారిపోయింది, కొత్త నెంబ‌ర్ ఏంటంటే
రూ. 1641 కోట్ల‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం.. ఈ రెండు ప‌ట్ట‌ణాల మ‌ధ్య త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం