మూడున్నరేళ్ల తర్వాత..

First Published Nov 7, 2016, 2:21 AM IST
Highlights

దిల్ సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 21న తుది తీర్పు

నిందితులకు ఉరి శిక్ష ఖరారయ్యే అవకాశం..

హైదరబాద్ లో వరుస బాంబు పేలుళ్లతో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు భత్కల్ అండ్ టీం కు కఠిన శిక్షణ విధించేందుకు ఎన్.ఐ.ఏ కోర్టు సిద్దమైంది.

3 ఏళ్ల పాటు కొనసాగిన దర్యాప్తునకు తెర దించుతూ ఈ నెల 21 న తుది తీర్పు వెలువరించేందుకు సిద్దమైంది. న్యాయ నిపుణుల అంచనాల ప్రకారం నిందితులకు ఉరి శిక్ష పడే అవకాశాలున్నట్టుగా సమాచారం. ఈ కేసులో A1 నిందితుడిగా  అసదుల్లాహ అక్తర్ , A2 గాయాసిన్ భత్కల్ , A3 గా తహసిన్ అక్తర్ A4గా జియావుర్ రెహ్మాన్ (పాక్) A5గా ఎజాజ్ షేక్ ఉన్నారు. 21 ఫిబ్రవరి 2013లో జరిగిన ఈ బ్లాస్ట్ లో 22 మంది మృతి చెందగా..138 మంది కి పైగా  గాయాలయ్యాయి.157 మంది సాక్ష్యులను విచారించిన కోర్ట్ 502 డాకుమెంట్స్ సేకరించింది 201 మెటీరియల్ సీజ్ చేసింది

 

click me!