ఫోటోలు, వీడియోలపై అసభ్యకర పోస్ట్‌లు.. అనసూయకి వేధింపులు, ఎట్టకేలకు చిక్కిన కేటుగాడు

By Siva KodatiFirst Published Nov 26, 2022, 7:42 PM IST
Highlights

హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్ట్ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోనసీమ జిల్లాకు చెందిన పండరిగా గుర్తించారు. 

సినీనటి అనసూయని సోషల్ మీడియాలో వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి పండరిగా గుర్తించారు. కొంతకాలంగా అనసూయని సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్నాడు పండరి. అనసూయ ఫోటోలు, వీడియోలపై అసభ్యకరమైన కామెంట్లు పెట్టి వైరల్ చేస్తున్నాడు. అలాగే అనసూయ వ్యక్తిగత జీవితంపైనా అతను అభ్యంతరకర కామెంట్లు చేస్తున్నాడు. దీనిపై అనసూయ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై నిఘా పెట్టారు. అయితే పండరి చాకచక్యంగా సెల్‌ఫోన్ మారుస్తూ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. దీంతో వారంపాటు కోనసీమ జిల్లాలోనే మకాం వేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు పండరిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇకపోతే... సినీ నటి పవిత్రా లోకేష్ కూడా ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తాను, నరేశ్ పట్ల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని టీవీ ఛానెళ్లలో , వెబ్‌సైట్స్‌ ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నాయని పవిత్ర ఆరోపించారు. 

ALso REad:మాపై మార్ఫింగ్ ఫోటోలు, అభ్యంతర వ్యాఖ్యలతో దుష్ప్రచారం : ఆ సైట్లు, ఛానెల్స్‌పై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించారు పవిత్రా లోకేష్. సెకండ్ ఇన్నింగ్స్ లో కన్నడ, మలయాళం, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ కేరీర్ లో ఫుల్ బిజీగా ఉంది.  అమ్మ, అత్త, తదితర కీలక పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది పవిత్రా. అటు కన్నడతో పాటు ఇటు టాలీవుడ్ లో నూ వందకు పైగా చిత్రాల్లో నటించి పాపులారిటీని దక్కించుకుంది. ఇటీవల నటుడు నరేష్ తో లైఫ్ షేర్ చేసుకోవడంతో మరింతగా తెలుగు ప్రజలకు పరిచయం అయ్యింది. కొద్దిరోజుల కింద నరేష్ - పవిత్రా లోకేష్ పెళ్లి మేటర్ తో నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. ఇంకా ఇష్యూ కొనసాగుతున్నప్పటికీ నరేష్ - పవిత్రా మాత్రం  కలిసే ఉంటున్నారు. సహజీవనం చేస్తూ కొత్త లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి బంధంపై రోజుకో కొత్త అంశం బయటికి వస్తోంది.
 

click me!