తెలంగాణ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌కు కన్నం.. రూ.1.96 కోట్లు మాయం చేసిన కేటుగాళ్లు

Siva Kodati |  
Published : Jul 15, 2021, 05:18 PM IST
తెలంగాణ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌కు కన్నం.. రూ.1.96 కోట్లు మాయం చేసిన కేటుగాళ్లు

సారాంశం

తెలంగాణ కో-ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌కు సైబర్ కేటుగాళ్లు షాకిచ్చారు. బ్యాంక్ ఖాతాల్లోకి ప్రవేశించి దాదాపుగా రూ.1.96 కోట్లను దోచుకున్నారు.  

తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంక్‌కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. దాదాపు కోటి 90 లక్షల రూపాయలు కొట్టేశారు కేటుగాళ్లు. కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన ఖాతా నుంచి నగదు మాయం చేశారు. కొట్టేసిన డబ్బును పది ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు నిందితులు. మరో కోటి రూపాయలు కొట్టేసేందుకు కూడా విఫలయత్నం చేశారు. డబ్బులు కొట్టేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌, చందానగర్‌‌లోని మూడు అకౌంట్ల నుంచి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సహా వేర్వేరు రాష్ట్రాలలోని బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ వివరాలతో అధికారులు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఆ రెండు శాఖలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది
 

PREV
click me!

Recommended Stories

Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం