సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ తుపాకీ మాయం .. కలకలం

Siva Kodati | Published : Oct 26, 2023 5:32 PM
Google News Follow Us

సారాంశం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తుపాకీ మాయమైన ఘటన కలకలం రేపింది . ఆగమేఘాల మీద రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలో తుపాకీని రికవరీ చేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తుపాకీ మాయమైన ఘటన కలకలం రేపింది. స్టేషన్ ఆవరణలో 30 రౌండ్లతో కూడిన ఇన్సాస్ 60 వెపన్ మాయం కావడంతో .. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగమేఘాల మీద రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలో తుపాకీని రికవరీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు ఆనంద్ మూర్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.