గాంధీలో కరోనా రోగి మృతదేహం మిస్సింగ్... 12 గంటల పాటు వెతుకలాట, చివరికి

Siva Kodati |  
Published : Jun 11, 2020, 07:12 PM ISTUpdated : Jun 11, 2020, 07:24 PM IST
గాంధీలో కరోనా రోగి మృతదేహం మిస్సింగ్... 12 గంటల పాటు వెతుకలాట, చివరికి

సారాంశం

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రి మార్చురీ నుంచి కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహం అదృశ్యమైంది. కోవిడ్ 19తో రషీద్ అలీ అనే వ్యక్తి మరణించడంతో అతని మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆయన కుటుంబసభ్యులు ఆసుపత్రికి వచ్చారు. 

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రి మార్చురీ నుంచి కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహం అదృశ్యమైంది. కోవిడ్ 19తో రషీద్ అలీ అనే వ్యక్తి మరణించడంతో అతని మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆయన కుటుంబసభ్యులు ఆసుపత్రికి వచ్చారు.

అయితే డెడీ బాడీ కనిపించకపోవడంతో ఆసుపత్రి వర్గాలకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో ఉదయం నుంచి అలీ మృతదేహం కోసం అణువణువు గాలించారు. చివరికి రషీద్ అలీ మృతదేహాన్ని వేరొకరికి అప్పగించినట్లు గుర్తించారు.

ఎట్టకేలకు రషీద్ మృతదేహాన్ని సంపాదించి కుటుంబసభ్యులకు అప్పగించడంతో ఆసుపత్రి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. రషీద్ డెడ్‌బాడీ కోసం సుమారు 12 గంటలుగా ఆయన కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. చివరికి మృతదేహం దొరకడంతో ఆందోళన విరమించి అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు. 

కాగా కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మంగళవారం రాత్రి చనిపోవడంతో ఆయన బంధువులు పీజీ వైద్యులపై దాడి చేయడంతో గాంధీ ఆసుపత్రి రణరంగంగా మారిన సంగతి తెలిసిందే.

ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స అందిస్తుంటే తమపై దాడులు చేయడంపై జూడులు భగ్గుమన్నారు. అన్ని వార్డుల వద్ద ఎస్పీజీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతూ ధర్నా చేశారు. 

PREV
click me!

Recommended Stories

Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu
RED Alert: ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్| Asianet News Telugu