తెలంగాణలో పెరుగుతున్న కరోనా: ఒక్క రోజులో 2 వేలకు పైగా కేసులు

By telugu teamFirst Published Aug 23, 2020, 8:50 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో 2 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ, ఖమ్మం వంటి జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో 2384 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షా 4249కి చేరుకుంది. 

హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు తగ్గడం లేదు. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో మాత్రం తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా నల్లగొండ, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా 11 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య755కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 1851 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 80,586 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఇంకా 22908 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కేసులు

ఆదిలాబాద్ 25
భద్రాద్రి కొత్తగూడెం 52
జిహెచ్ఎంసి 472
జగిత్యాల 105
జనగామ 30
జయశంకర్ భూపాలపల్లి 7
జోగులాంబ గద్వాల 68
కామారెడ్డి 69
కరీంనగర్ 120
ఖమ్మం 105
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 12
మహబూబ్ నగర్ 61
మహబూబాబాద్ 52
మంచిర్యాల 90
మెదక్ 23
మేడ్చెల్ మల్కాజిగిరి 52
ములుగు 19
నాగర్ కర్నూలు 29
నల్లగొండ 137
నారాయణపేట 13
నిర్మల్ 19
నిజామాబాద్ 148
పెద్దపల్లి 65
రాజన్న సిరిసిల్ల 42
రంగారెడ్డి 131
సంగారెడ్డి 61
సిద్ధిపేట 67
సూర్యాపేట 110
వికారాబాద్ 19
వనపర్తి 47
వరంగల్ రూరల్ 21
వరంగల్ అర్బన్ 85
యాదాద్రి భువనగిరి 28
మొత్తం కేసులు 2384

 

Media Bulletin on status of positive cases in Telangana. (Dated. 23.08.2020) pic.twitter.com/yKliUeEvnF

— Dr G Srinivasa Rao (@drgsrao)
click me!