కానిస్టేబుల్ నిర్వాకం.. యువతితో మూడేళ్ల ప్రేమ, పెళ్లైనా వదలక... మళ్లీ తాళి కట్టి.. చివరికి మొహం చాటేసి...

By SumaBala BukkaFirst Published Jan 27, 2022, 2:01 PM IST
Highlights

కానిస్టేబుల్ యాసరేని సంతోష్ కుమార్ మూడేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ నమ్మ బలికాడు. మాయమాటలు చెప్పి తనను లోబరుచుకున్నాడు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆమె నిలదీయగా మొహం చాటేశాడు. ఏడాది క్రితం ఇంట్లో వారి అంగీకారం మేరకు మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఆ తర్వాత సైతం ఫోన్ లో రోజు చాటింగ్ చేస్తూ.. తనను పెళ్లి చేసుకుంటానని.. తన వెంట రమ్మని నమ్మించాడు. అతని మాటలు నమ్మి ఇంటి నుంచి వెళ్లిన ఆమెను కరీంనగర్ లో ఒక అద్దె ఇంట్లో ఉంచాడు. 
 

సిద్ధిపేట : siddipetలో ఓ constable దారుణానికి తెగబడ్డాడు. మూడేళ్లు ప్రేమిస్తున్నాని వెంటపడి, వేధించి.. చివరికి లోబరుచుకుని.. తీరా పెళ్లి మాటెత్తేసరికి మొహం చాటేశాడు. దీంతో విసిగిపోయిన woman వేరే యువకుడిని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత మళ్లీ మెసేజ్ లు, ఛాటింగులతో వెంటపడ్డాడు ఆ కానిస్టేబుల్.. భర్తను వదిలేసి వస్తే.. పెళ్లి చేసుకుంటాని నమ్మబలికాడు.. తీరా ఇంట్లో నుంచి వచ్చిన అమ్మాయికి ఎవ్వరికీ తెలీకుండా తాళి కట్టి.. కొద్ది రోజులు వాడుకుని.. తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఆ యువతి తనకు న్యాయం చేయమంటూ అతని ఇంటిముందు ధర్నాకు దిగింది...

ప్రేమించి పెళ్ల చేసుకుంటానని నమ్మ బలికిన ప్రియుడు మాట తప్పడంతో ప్రియురాలు అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలోని చిన్న కోడూర్ మండల పరిధిలోని రామునిపట్లలో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన పల్లె విద్యను చిన్న కోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన కానిస్టేబుల్ యాసరేని సంతోష్ కుమార్ మూడేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ నమ్మ బలికాడు. 

మాయమాటలు చెప్పి తనను లోబరుచుకున్నాడు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆమె నిలదీయగా మొహం చాటేశాడు. ఏడాది క్రితం ఇంట్లో వారి అంగీకారం మేరకు మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఆ తర్వాత సైతం ఫోన్ లో రోజు చాటింగ్ చేస్తూ.. తనను పెళ్లి చేసుకుంటానని.. తన వెంట రమ్మని నమ్మించాడు. అతని మాటలు నమ్మి ఇంటి నుంచి వెళ్లిన ఆమెను కరీంనగర్ లో ఒక అద్దె ఇంట్లో ఉంచాడు. 

ఆ సమయంలో ఆమెకు మంగళసూత్రం కట్టాడు. ఇప్పుడు ఆమెకు కనబడకుండా తిరుగుతున్నాడు. దీంతో న్యాయం చేసే వరకు రామునిపట్లలో సంతోష్ కుమార్ ఇంటి ఎదుట నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చుంది విద్య. ఆమెకు మద్ధతుగా వారి కుటుంబసభ్యులు నిలిచారు. 

ఇలాంటి ఘటనే నిరుడు సెప్టెంబర్ లో వేములవాడలో చోటు చేసుకుంది. వేములవాడ లో రెండేళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు మోసం చేశాడని ఓ యువతి మేనబావ ఇంటి ఎదుట బైఠాయించిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ చెందిన తన మేనబావ ఎదురు గట్ల రాము అదే కాలనీలో నివసిస్తున్న తన మేనమామ కూతురు గౌతమి ప్రేమిస్తున్నానని చెప్పాడు.  

రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి  చేసుకుంటానని చెప్పి మోసగించాడని ఆ యువతి వాపోయింది. తన తల్లి మాటలు విని తప్పించుకు తిరుగుతున్నాడని  గౌతమి ఆవేదన చెందింది. ఈ విషయమై గౌతమి పోలీసులకు  ఫిర్యాదు చేయగా సీఐ వెంకటేష్ ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. 

అయినా రాము మారకపోవడంతో సెప్టెంబర్ 30 ఉదయం ఈ విషయమై గౌతమి అడిగేందుకు వెళ్లడంతో ఇంటికి తాళం వేసి తల్లి కొడుకు ఇద్దరూ వెళ్లిపోయారు అని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని బాధితులు ఇంటి ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది. 

click me!