కాంగ్రెస్ నాయకుడు భట్టితో ప్రజా గాయకుడు గద్దర్ భేటీ...

Published : Sep 29, 2018, 03:56 PM ISTUpdated : Sep 29, 2018, 04:08 PM IST
కాంగ్రెస్ నాయకుడు భట్టితో ప్రజా గాయకుడు గద్దర్ భేటీ...

సారాంశం

తెలంగాణలోని అన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు ముఖ్యమైన పార్టీలు పదునైన వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక నాయకులు కూడా తమ పార్టీ గెలుపుకు దోహదపడే ఏ అవకాశాన్ని వదలడం లేదు.  

తెలంగాణలోని అన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు ముఖ్యమైన పార్టీలు పదునైన వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక నాయకులు కూడా తమ పార్టీ గెలుపుకు దోహదపడే ఏ అవకాశాన్ని వదలడం లేదు.  

తాజాగా అలాంటి భేటీ ఒకటి కాంగ్రెస్ ప్రచార సారథి భట్టి విక్రమార్క ఇంట్లో జరిగింది. ప్రజా యుద్దనౌక, గాయకుడు గద్దర్ భట్టితో సమావేశమవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. భట్టి విక్రమార్క ఇంట్లో ఈ భేటీ జరిగింది. 

 ఈ సమావేశం అనంతరం భట్టి మాట్లాడుతూ...పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణ కోసం కవులు, కళాకారులు తమతో కలిసిరావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ విషయంపై చర్చించేందుకే గద్దర్ తో సమావేశమైనట్లు భట్టి తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందరి సహాయం కోరుతున్నామని అన్నారు. 

ఏ ఆశయాలతో అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఈ నాలుగున్నరేళ్లలో అవేవీ నెరవేరలేదని విమర్శించారు. కాబట్టి వచ్చే ప్రభుత్వం లోనైనా అవన్నీ నెరవేరాలంటే తమతో కలిసి రావాల్సిందిగా కవులు, మేధావులతో పాటు ప్రజలను కోరుతున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.  
 

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu