కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ట్విస్ట్: కొమ్మూరికి బీ ఫారం

Published : May 14, 2019, 01:35 PM ISTUpdated : May 14, 2019, 01:58 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ట్విస్ట్: కొమ్మూరికి బీ ఫారం

సారాంశం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉదయ మోహన్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. పోటీకి ఉదయ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించలేదు. దీంతో ఆయన స్థానంలో  కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పార్టీ టిక్కెట్ ఇచ్చింది.

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉదయ మోహన్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. పోటీకి ఉదయ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించలేదు. దీంతో ఆయన స్థానంలో  కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పార్టీ టిక్కెట్ ఇచ్చింది.

రంగారెడ్డి జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కాంగ్రెస్  పార్టీ తన అభ్యర్థిగా ఉదయ మోహన్ రెడ్డిని బరిలోకి దింపుతున్నట్టుగా సోమవారం నాడు ప్రకటించింది.

అయితే మంగళవారం నాడు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజు. ఈ జిల్లా నుండి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడినా కూడ ఉదయ మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ  టిక్కెట్టు ఇచ్చింది. 

 కానీ, ఆయన పోటీకి నిరాకరించారు. దీంతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. మంగళవారం నాడు కొమ్మూరి ప్రతాప్  రెడ్డికి పీసీసీ చీఫ్ బీ ఫారాన్ని కూడ అందించింది. రంగారెడ్డి కలెక్టరేట్ ‌లో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్