ఆ నాలుగు మండలాల్లో దళితబంధు: ఈ నెల 27న కేసీఆర్ కీలక సమావేశం

Published : Sep 10, 2021, 03:03 PM ISTUpdated : Sep 10, 2021, 03:16 PM IST
ఆ నాలుగు మండలాల్లో దళితబంధు: ఈ నెల 27న కేసీఆర్ కీలక సమావేశం

సారాంశం

హూజూరాబాద్ తో పాటు కొత్తగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ ఈ నెల 27న అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష చేయనున్నారు. ఢిల్లీ టూర్ తర్వాత ఈ నాలుగు మండలాలపై సమావేశం నిర్వహిస్తానని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: హుజూరాబాద్ తో పాటు మరో నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 27న  సమీక్షించనున్నారు.హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని  తెలంగాణ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. గత నెల 16వ తేదీన ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రం మొత్తం ఈ పథకాన్ని అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలోని దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న మరో  నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.

చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్ హుజూరాబాద్ తో పాటు ఈ నాలుగు మండలాల్లో అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకొన్నారు. ఢిల్లీ టూర్ తర్వాత ఈ నియోజకవర్గాలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ ఈ నాలుగు మండలాలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్ననారు.

ఈ నాలుగు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జిల్లా పరిషత్ ఛైర్మెన్లతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ కూడా హాజరు కానున్నారు.

PREV
click me!

Recommended Stories

SIR గడువు మరోసారి పొడిగింపు.. ఓటర్లకు ఈసీ కీలక అవకాశం, చివ‌రి తేదీ ఎప్పుడంటే
ఆప్త మిత్రుడిని కోల్పోయా పెద్ది మరణంపై కేసీఆర్ ఎమోషనల్ | BRS Leader Peddi Sudarshan Reddy