ఉత్తమ్ పర్యటనలో ఘర్షణ: టీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర రాళ్ల దాడి

Published : May 10, 2019, 04:15 PM ISTUpdated : May 10, 2019, 04:17 PM IST
ఉత్తమ్ పర్యటనలో ఘర్షణ: టీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర రాళ్ల దాడి

సారాంశం

సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాలో శుక్రవారం నాడు కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.


సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాలో శుక్రవారం నాడు కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.

ఈ గ్రామంలో ప్రచారం నిర్వహించేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం  చేయడాన్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకొన్నారు.తమ గ్రామానికి ఏం చేశావని ఉత్తమ్‌ను నిలదీశారు.

ఈ సమయంలో రెండు పార్టీలు పరస్పరం రాళ్లు రువ్వుకొన్నారు.  ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకొన్నారు. ఈ దాడిలో గాయపడిన వారిని హుజూర్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో భారీ పెట్టుబడులు అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన | Amazon Data Centre in Telangana
Driving Licence: ట్రాఫిక్ ఫైన్ ప‌డ్డ‌ట్లు ఫోన్‌కి మెసేజ్ రావ‌డం లేదా.? ఇంట్లోనే ఫోన్ నెంబ‌ర్ మార్చేయండి