పార్కింగ్ విషయంలో గొడవ, ఇరువర్గాల ఘర్షణ: మహిళలనీ వదలకుండా పిడిగుద్దులు

By Siva KodatiFirst Published Sep 2, 2020, 7:59 PM IST
Highlights

పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని కుల్సుంపురలోని ముస్తైద్ పురా బస్తీలో నివాసముండే ఫరూక్ హూస్సేన్ తన ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు. 

పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని కుల్సుంపురలోని ముస్తైద్ పురా బస్తీలో నివాసముండే ఫరూక్ హూస్సేన్ తన ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు.

ఇదే సమయంలో అటుగా వచ్చిన ఫిరోజ్ అలియాస్ అల్లూ వచ్చి రోడ్డుపై బైక్ ఎందుకు పెట్టావంటూ వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా తన సోదరులు దర్వేష్, జాఫర్‌తో పాటు మరికొందరితో కలిసి ఫరూక్ ఇంటిని చుట్టుముట్టాడు.

బైక్‌ని ధ్వంసం చేయడంతో  పాటు ఇంట్లోకి చొరబడి కిటికీలు, టీవీ, మొబైల్ ఫోన్లు పగులగొట్టారు. ఆ సమయంలో అడ్డొచ్చిన ఫరూక్ కుమారుడిపై దాడి చేశారు. చంపేస్తామని తుపాకీతో బెదిరించడంతో పాటు ఆడవాళ్లని కూడా చూడకుండా మహిళలపై సైతం పిడిగుద్దుల వర్షం కురిపించారు.

దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అలాంటిదేమి లేదని తాము ఫిర్యాదు స్వీకరించామని, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

click me!