టీఆర్ఎస్- బీజేపీ కార్యకర్తల బాహాబాహీ: మైలార్‌‌దేవ్‌పల్లిలో ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Dec 19, 2020, 3:05 PM IST
Highlights

హైదరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. మైలార్‌దేవ్‌పల్లిలో ఇరు పార్టీల నాయకులు ఘర్షణ జరిగింది. దుర్గానగర్‌లో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లారు కార్పోరేటర్.

హైదరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. మైలార్‌దేవ్‌పల్లిలో ఇరు పార్టీల నాయకులు ఘర్షణ జరిగింది. దుర్గానగర్‌లో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లారు కార్పోరేటర్.

ఈ సమయంలోనే వాగ్వాదం చోటు చేసుకుని, ఘర్షణకు దారి తీసింది. కార్పోరేటర్ కారుపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు పాక్షికంగా ధ్వంసమైంది.

దీనిపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో గతంలో కూడా టీఆర్ఎస్ కార్యర్తలపై బీజేపీ నాయకులు దాడికి పాల్పడిన ఉదంతాలు వున్నాయి.  

click me!