సిద్దిపేట జిల్లాలో మరోసారి ఉద్రిక్తత.. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు, పోలీసులు మధ్య తోపులాట

Published : Jun 13, 2022, 12:44 PM IST
సిద్దిపేట జిల్లాలో మరోసారి ఉద్రిక్తత.. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు, పోలీసులు మధ్య తోపులాట

సారాంశం

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడిపాటిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు మరోమారు ఆందోళనకు దిగారు. హుస్నాబాద్ పోలీసు స్టేషన్ ముట్టడికి యత్నించారు. 

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడిపాటిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు మరోమారు ఆందోళనకు దిగారు. హుస్నాబాద్ పోలీసు స్టేషన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలోనే ఎల్లమ్మ చెరువు వద్ద నిర్వాసితులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. నిర్వాహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత రాత్రి కూడా ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. 

ఇక, హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్ సిద్దమైన నేపథ్యంలో ట్రయల్ రన్ కు అధికారులు సిద్దమయ్యారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో భూమిని  కోల్పోయిన నిర్వాసితులు ఒప్పందం ప్రకారం బెనిఫిట్స్ అందలేదని ఆందోళనకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే  అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో గత అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకు సిద్దమైన సుమారు 100 మంది భూ నిర్వాసితులను అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ క్రమంలోనే పోలీసులకు, భూనిర్వాసితులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్సడంతో పోలీసులు నిర్వాసితులపై లాఠీచార్జ్ చేసారు. దీంతో చాలా మంది భూ నిర్వాసితులకు గాయాలయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu