నాన్నతో కలిసి బైక్‌పై షికారు, చిన్నారి మెడను కోసేసిన చైనా మాంజా.. పరిస్ధితి విషమం

Siva Kodati |  
Published : Jan 13, 2023, 08:39 PM ISTUpdated : Jan 13, 2023, 08:42 PM IST
నాన్నతో కలిసి బైక్‌పై షికారు, చిన్నారి మెడను కోసేసిన చైనా మాంజా.. పరిస్ధితి విషమం

సారాంశం

ప్రభుత్వం నిషేధించినా చైనా మంజా విక్రయాలు యధేచ్చగా సాగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌ నాగోల్‌లో చైనా మంజా మెడకు చుట్టుకుని చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.       

చైనా మంజా ఒక చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. నాన్నతో కలిసి బైక్‌పై వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారి మెడకి మంజా చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన తండ్రి పాపను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. హైదరాబాద్‌లోని నాగోల్ ఫ్లై ఓవర్‌పై జరిగింది ఈ ఘటన. చైనా మంజాపై నిషేధం వున్నప్పటికీ .. నగరంలోని రోడ్లపై బహిరంగంగా దీనిని విక్రయిస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకు చిన్నారి ఆసుపత్రి పాలైంది. పోలీసులు స్పందించి నగరంలో చైనా మాంజా అమ్మకుండా దాడులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

AP & TElangana Rain Alert! వాతావరణశాఖ హెచ్చరిక రానున్న వారం రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఫ్రెండ్ భార్య‌తో వివాహేత‌ర సంబంధం, ఆపై హ‌త్య‌.. హంత‌కుడిని ప‌ట్టించిన బాల‌య్య ఫొటో. సినిమాను మించిన క్రైమ్ స్టోరీ