సికింద్రాబాద్ : వారం క్రితం అదృశ్యం.. చివరికి క్వారీ గుంతలో శవమై తేలిన బాలుడు

Siva Kodati |  
Published : Dec 04, 2022, 08:05 PM IST
సికింద్రాబాద్ : వారం క్రితం అదృశ్యం.. చివరికి క్వారీ గుంతలో శవమై తేలిన బాలుడు

సారాంశం

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో అదృశ్యమైన ఉస్మాన్ అనే బాలుడు తిరుమలగిరిలోని ఓ క్వారీలో శవమై తేలాడు. అయితే చిన్నారి మరణంపై తల్లీదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమైంది. ఉస్మాన్ అనే బాలుడు గత నెల 28 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో ఆదివారం తిరుమలగిరిలోని క్వారీ గుంతలో శవమై తేలాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉస్మాన్ మృతిపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు