హైదరాబాద్‌లో సీబీఐ దాడులు.. ప్రముఖుల ఇళ్లలో సోదాలు

By sivanagaprasad kodatiFirst Published Oct 26, 2018, 10:49 AM IST
Highlights

హైదరాబాద్‌లో సీబీఐ దాడులు కలకలం రేపుతున్నాయి.. నగరంలోని పలువురు ప్రముఖుల ఇళ్లపై సోదాలు నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు భాగ్యనగరానికి చేరుకున్నాయి. 

హైదరాబాద్‌లో సీబీఐ దాడులు కలకలం రేపుతున్నాయి.. నగరంలోని పలువురు ప్రముఖుల ఇళ్లపై సోదాలు నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు భాగ్యనగరానికి చేరుకున్నాయి. అయితే దాడులు ఎవరెవరిపై జరిగాయి.. ఎందుకు జరిగాయన్న దానిపై వివరాలు అందాల్సి ఉంది.

అయితే రాకేశ్ ఆస్థానా వ్యవహారంలో వినిపిస్తున్న సతీష్ సానా ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించేందుకే సీబీఐ బృందాలు ఇక్కడికి వచ్చాయనే ప్రచారం జరుగుతుంది. అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలను కేంద్రప్రభుత్వం సెలవుపై పంపి.. మన్నెం నాగేశ్వరరావును ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
 

click me!