షేక్ పేట భూ వ్యవహారం.... బయటపడుతున్న ఎమ్మార్వో సుజాత అక్రమాలు

Published : Jun 08, 2020, 11:47 AM ISTUpdated : Aug 09, 2020, 05:20 PM IST
షేక్ పేట భూ వ్యవహారం.... బయటపడుతున్న ఎమ్మార్వో సుజాత అక్రమాలు

సారాంశం

సుజాత ఇంట్లో షేక్ పేట్‌కు చెందిన మరిన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను‌ కూడా ఏసీబీ అధికారులు‌ గుర్తించినట్లు సమాచారం. దీంతో ఇవాళ మరోసారి సుజాతను ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది.  

ఎమ్మార్వో సుజాత అక్రమాలు మరిన్ని బయటపడుతున్నాయి. షేక్ పేట భూ వ్యవహారంలో ఎమ్మార్వో సుజాత మెడ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. ఆదివారం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతను అధికారులు సుదీర్ఘంగా విచారించిన కూడా ఇంట్లో దొరికిన రూ.30 లక్షలు, నగలు విషయంలో సుజాత ఆధారాలు చూపించలేదని తెలిసింది. 

శాలరీ డబ్బులు బ్యాంకు నుంచి డ్రా చేశానని సుజాత చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. అయితే బ్యాంకు నుంచి డ్రా చేశానని చెప్పేందుకు ఆధారాలను సైతం ఆమె చూపించలేకపోయారు. 

సుజాత ఇంట్లో షేక్ పేట్‌కు చెందిన మరిన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను‌ కూడా ఏసీబీ అధికారులు‌ గుర్తించినట్లు సమాచారం. దీంతో ఇవాళ మరోసారి సుజాతను ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది.

ఈ కేసులో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న అందరి కాల్ రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో వసంత కుమారిని అధికారులు విచారించారు. రెండు రోజుల పాటు ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్సై రవీందర్ నాయక్, ఎమ్మార్వో సుజాతలను సుదీర్ఘంగా అధికారులు విచారించారు. 

ముగ్గురి‌ స్టేట్‌మెంట్లను అధికారులు రికార్డు చేశారు. ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్సై రవీందర్ నాయక్‌లను రిమాండ్‌కు తరలించారు. లంచం కేసులో సుజాత పాత్ర ఉందని తేలితే సుజాతను కూడా రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.
 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu