ఓటుకు నోటు కేసు: రేవంత్, సండ్ర పిటిషన్లపై విచారణ ఎల్లుండికి వాయిదా

Published : Aug 23, 2021, 02:59 PM IST
ఓటుకు నోటు కేసు: రేవంత్, సండ్ర పిటిషన్లపై  విచారణ ఎల్లుండికి వాయిదా

సారాంశం

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం  ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సండ్ర వెంకటవీరయ్య  పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏసీబీ చట్టం వర్తించదని రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.   

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసు వ్యవహరంలో దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.  సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిటిషన్లపై ఎల్లుండి విచారణ చేుపట్టనున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరీ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం  ఈ పిటిషన్లను విచారిస్తోంది.

ఓటుకు నోటు కేసులో తన పేరును తొలగించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను  2020 డిసెంబర్  8వ తేదీన హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వులను ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు ఓటుకు నోటు కేసు విచారణలో  ఏసీబీ చట్టం వర్తించదని రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే