ల్యాండ్ సెటిల్‌మెంట్ పేరిట కోటి మోసం: కత్తి కార్తీకపై కేసు నమోదు

By Siva KodatiFirst Published Oct 16, 2020, 6:17 PM IST
Highlights

సీజన్ 1 బిగ్‌బాస్ ఫేం కత్తీ కార్తీకపై కేసు నమోదైంది. ఒక ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తానంటూ కోటి రూపాయల మేర కార్తీక ఆమె అనుచరులు మోసానికి పాల్పడినట్లు బాధితులు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

సీజన్ 1 బిగ్‌బాస్ ఫేం కత్తీ కార్తీకపై కేసు నమోదైంది. ఒక ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తానంటూ కోటి రూపాయల మేర కార్తీక ఆమె అనుచరులు మోసానికి పాల్పడినట్లు బాధితులు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమీన్‌పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు ఈమె మధ్యవర్తిత్వం చేసింది. తర్వాత అవతలి పార్టీ నుంచి కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది. 

click me!