తెలంగాణలో ఏపార్టీతోనూ పొత్తు లేదు: బీఎస్పీ అధినేత్రి మాయావతి

Published : Nov 28, 2018, 02:53 PM IST
తెలంగాణలో ఏపార్టీతోనూ పొత్తు లేదు: బీఎస్పీ అధినేత్రి మాయావతి

సారాంశం

తెలంగాణ ఎన్నికల్లో బీఎస్పీ 100 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లాలో పర్యటించిన మాయావతి తెలంగాణలో ఏ పార్టీతోనూ తమకు పొత్తు లేదన్నారు. 

నిర్మల్: తెలంగాణ ఎన్నికల్లో బీఎస్పీ 100 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లాలో పర్యటించిన మాయావతి తెలంగాణలో ఏ పార్టీతోనూ తమకు పొత్తు లేదన్నారు. 

తెలంగాణలో బడుగులు బలహీన వర్గాలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అవినీతి విపరీతంగా జరుగుతోందన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగిపోయాయని ఆమె ఆరోపించారు. 

కాన్సీరామ్ కన్న కలలు నిజం చేద్దామని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. పేదలు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే అది బీఎస్పీతోనే సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీకి ఓటెయ్యాలని కోరారు.  ప్రజలు గమనించి బీజేపీకి, టీఆర్ఎస్ కు ఓటేయోద్దని మాయావతి పిలుపునిచ్చారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu