MLC Kavitha: "నేమ్ ఛేంజింగ్ గవర్నమెంటే.. గేమ్ ఛేంజింగ్‌ గవర్నమెంట్ కాదు"

Published : Feb 11, 2024, 05:59 AM IST
MLC Kavitha: "నేమ్ ఛేంజింగ్ గవర్నమెంటే.. గేమ్ ఛేంజింగ్‌ గవర్నమెంట్ కాదు"

సారాంశం

MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకపడ్డారు. నేమ్ ఛేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ ఛేంజింగ్‌ గవర్నమెంట్ కాదనీ, ఆ విషయం  బడ్జెట్‌ను చూస్తేనే అర్థమవుతుందని మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1,01,116 అందజేసిందని, తులాల బంగారం కానుకగా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకపడ్డారు. రేవంత్ సర్కార్ పథకాల పేర్లు మార్చడమే తప్ప.. ఎలాంటి ప్రగతిని సాధించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గేమ్ ఛేంజర్ కాదని శనివారం ఆర్థిక మంత్రి, మండలిలో ఆర్థిక మంత్రి, ఐటీ శాఖ మంత్రి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ రుజువు చేసిందని అన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. ఇది కేవలం నేమ్ ఛేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ ఛేంజింగ్‌ గవర్నమెంట్ కాదనీ. ఆ విషయం  బడ్జెట్‌ను చూస్తేనే అర్థమవుతుందని మండిపడ్డారు.

గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1,01,116 అందజేసిందని, తులాల బంగారం కానుకగా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ పథకానికి కేటాయింపులు,  బడ్జెట్‌లో అదనపు బహుమతి ఎక్కడ ఉన్నాయి? మొత్తం బడ్జెట్‌లో ఈ పథకం ప్రస్తావన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, వారి వేతనాలను రూ.18వేలకు పెంచుతామని కాంగ్రెస్‌ చేసిన హామీని కవిత ప్రస్తావిస్తూ.. బడ్జెట్‌లో ఆశావర్కర్ల ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తనను నిరాశపరిచిందని కవిత అన్నారు. హామీల అమలుకు బాటలు వేస్తున్న ఈ బడ్జెట్‌పై సామాన్యులు ఎన్నో ఎదురు చూస్తున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తోందని, అందుకే బడ్జెట్‌లో మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాల ప్రస్తావన లేదని ఆమె అన్నారు.

మైనారిటీ సంక్షేమానికి కేవలం రూ.2,000 కోట్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. ఇమామ్‌లు, మోజమ్‌లకు రూ.10,000, ముస్లిం పిల్లలకు తోఫా ఇ తాలిమ్ గురించి కూడా ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రస్తావించలేదని ఆమె విమర్శించారు. పేర్లు, చిహ్నాలను మార్చుకోవాలనే తపనతో ఉన్న ప్రభుత్వం కనీసం వ్యవసాయం వంటి ప్రధాన రంగాలకు సరిపడా నిధులు కేటాయించేందుకు మొగ్గు చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మూడు నుంచి నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని, తమ ప్రభుత్వ హయంలో రాష్ట్రమంతటికీ నాణ్యమైన విద్యుత్‌ను అందించిందని ఆమె అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్