అసైన్డ్ భూములు బినామీలకు కట్టబెట్టేందుకు బీఆర్ఎస్ కుట్ర - కాంగ్రెస్.. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు

Published : Dec 02, 2023, 04:54 PM IST
అసైన్డ్ భూములు బినామీలకు కట్టబెట్టేందుకు బీఆర్ఎస్ కుట్ర - కాంగ్రెస్.. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు

సారాంశం

రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వేలాది ఎకరాల అసైన్డ్ భూములను బీనామీలకు కట్టబెట్టేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీనిని వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలోని అసైన్డ్ భూములు తమకు అనుకూలంగా ఉన్న బినామీలకు కట్టబెట్టేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి కొద్ది రోజుల్లోనే కమీషన్లు వీలుగా.. వారికి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టులకు సుమారు రూ.6 
వేల కోట్ల రైతుబంధు సొమ్మును పంపిణీ చేయాలని యోచిస్తోందని తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఎన్నికల సంఘానికి (ఈసీ) ఫిర్యాదు చేశారు. 

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారికి అందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అందించిన లేఖలో..  రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని వారు పేర్కొన్నారు. దీంతో రైతుబంధు పంపిణీకి ఈసీఐ అనుమతించకపోవడంతో అదే మొత్తాన్ని కమీషన్లు/ముడుపులు రూపంలో పొందేందుకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు ఆ రైతుబంధు నిధులను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందని ఆరోపించారు. రూ.6,000 కోట్ల భారీ చెల్లింపులు తమ అభిమాన కాంట్రాక్టర్లకు ఆఫ్ టర్న్ పద్ధతిలో ఇచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

ధరణి పోర్టల్ ప్రకారం రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వేలాది ఎకరాల అసైన్డ్ భూములను సీఎం కుటుంబ సభ్యుల బినామీలకు బదిలీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎంసీసీ అమల్లో ఉన్న సమయంలో ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని ఈసీని కోరారు.

అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురించి మీడియా ఆయనను ప్రశ్నించింది. తన రాజీనామాను గవర్నర్ కు సమర్పించేందుకే ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం