రాజేంద్రనగర్: బాలుడి అదృశ్యం విషాదాంతం... ఇంటి దగ్గర చెరువులో శవమై తేలిన చిన్నారి

Siva Kodati |  
Published : Aug 28, 2021, 03:25 PM IST
రాజేంద్రనగర్: బాలుడి అదృశ్యం విషాదాంతం... ఇంటి దగ్గర చెరువులో శవమై తేలిన చిన్నారి

సారాంశం

హైదరాబాదు రాజేంద్రనగర్‌లో చిన్నారి అదృశ్యం కథ విషాదాంతం అయ్యింది. ఆ బాలుడు తన ఇంటి సమీపంలోని చెరువులో శవమై తేలాడు. ఆ చిన్నారి ప్రమాదవశాత్తూ గుంతలో పటిపోయాడా లేక ఎవరైనా చంపేసి చెరువులో పడేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాదు రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. నిన్న ఓ బాలుడు కనిపించకుండా పోవడం తెలిసిందే. ఆ బాలుడి అదృశ్యం కథ విషాదాంతం అయింది. ఆ చిన్నారి రాజేంద్రనగర్ సమీపంలోని ఓ చెరువులో శవమై తేలాడు. ఆడుకుంటూ వెళ్లి మళ్లీ ఇంటికి రాని తమ బిడ్డను ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు అబ్దుల్ రహీమ్, తబస్సుమ్ కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ చిన్నారి ప్రమాదవశాత్తూ గుంతలో పటిపోయాడా లేక ఎవరైనా చంపేసి చెరువులో పడేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికులను సైతం విషాదానికి గురిచేసింది
 

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...